‘మా’ మనస్పర్థలు తొలగాయ్

‘మా’ మనస్పర్థలు తొలగాయ్. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)కు సంబంధించిన నిధుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ‘మా’ సభ్యులు ఉమ్మడి ప్రకటన చేశారు. ఇటీవల ‘మా’లో చెలరేగిన వివాదం గురించి నిర్మాత సురేష్‌బాబు, మా అధ్యక్ష, కార్యదర్శులు శివాజీరాజా, నరేష్‌లతో కలిసి ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విలేకరులతో మాట్లాడారు.

నలుగురు మనుషులు కలిసి పనిచేసే ఒక సంస్థలో భేదాభిప్రాయలు రావడం సహజం. ఈ నేపథ్యంలో కలెక్టివ్‌ కమిటీని ఏర్పాటు చేసి, వాళ్లకు అన్నీ వివరించి, సమస్య పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నాం. గతం గతః. రానున్న రోజుల్లో సిల్వర్‌ జూబ్లీని విజయవంతం చేయడం మా ప్రధాన కర్తవ్యం అన్నారు నరేష్.

ఇక, ‘మా’ మనస్పర్థలు తొలగాయి ‘మా’ నిధుల ఖర్చులకు సంబంధించిన ఫైల్స్‌ పెద్దల ఎదుట పెట్టాను. వాళ్లెవరూ నాకు, నరేష్‌కు చుట్టాలు కారు. వాళ్లు అన్నీ తనిఖీ చేసి, ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారని మా అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు.