చైతూ, సమంత సేఫ్ గేమ్

మొగుడు-పెళ్లాంల ఫైట్ చూసి థ్రిల్లింగ్ గా ఫీలవుదామనుకొన్న మొహాలు వాచిపోయాయ్. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్13న భార్యభర్తలు నాగ చైతన్య-సమంత ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ యుద్ధానికి దిగారు. చైతూ నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’, సమంత నటించిన ‘యు టర్న్’ ఆరోజే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. దీంతో బాక్సాఫీస్ ఫైట్ కాస్త భార్యభర్తల ఫైట్ గా మారనుంది. వీరి ఫైట్ చూసి ఎంజాయ్ చేయొచ్చని కొందరు ఆశగా ఎదురు చూశారు. ఐతే, వారికి ఆ ఛాన్స్ దొరకలేదు. చై-సామ్ సేఫ్ గేమ్ ఆడారు.

ఈ రెండు చిత్రాలు ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకొన్నాయి. థియేటర్స్ లో నవ్వులు పూయిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించాడు. ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-5 లో నిలిచాడు. ఈ సినిమా 12 కోట్ల గ్రాస్ ను 6.50 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక, సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన సమంత ‘యు టర్న్’ ఫస్ట్ షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకొంది. తొలి రోజున 2 కోట్ల గ్రాస్ ను .. కోటి పది లక్షల షేర్ ను వసూలు చేసింది.

ఒకేరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రెండు చిత్రాలు వేరు వేరు జోనర్ కు చెందినవి కావడం కలిసొచ్చింది. విచిత్రమేమిటంటే.. ? రివ్యూ రేటింగ్స్ ఎక్కువగా సాధించిన ‘యు టర్న్’ కలెక్షన్స్ అల్లుడు రేంజ్ లో లేవు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక వర్గం ప్రేక్షకులని మాత్రమే ఆకట్టుకోవడం ఇందుకు కారణం. అల్లుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో.. కాసులు బాగా వచ్చి పడుతున్నాయ్. మొత్తానికి.. చైతూ-సామ్ లు సేఫ్ గెమ్ ఆడారు. వీరి చిత్రాలు సేమ్ జోన్ లోకి వచ్చేశాయని ట్రేడ్ వర్గాల సమాచారమ్.