బిగ్ బాస్’లో.. ఇక మిగిలింది ఒక్కరే !

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకొంది. ఈ వారం హౌస్ నుంచి అమిత్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. వీరిలో నుంచి ఒక్కరు మాత్రమే ఎలిమినేట్ కానున్నారు. మిగిలిన ఐదురుగు సభ్యులతో ఫైనల్ ఏపీసోడ్ జరగనుంది. ఈ 5గురు నుంచి ఒక్కరిని విజేతగా ప్రకటించబోతున్నారు.

ఆ విజేతగా నిలిచే అవకాశాలు కౌశల్‌ కు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. వినాయక చవితి వేడుకల్లోనూ కౌశల్‌ క్రేజీ కనిపించింది. అంతకుముందు కౌశల్‌ ఆర్మీ హైదరాబాద్ లో 2కె రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్‌ నిలివకపోతే.. సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరగేలా కనిపిస్తోంది.

ఐతే, బిగ్ బాస్ మాత్రం పెద్ద ట్విస్టే ఇచ్చేలా కనబడుతున్నాడు. శనివారం షోలో నాని కౌశల్‌పై సీరియస్‌ అవ్వడం, రెడ్‌ ఫిష్‌ స్టోరీ చెప్పడం పలు అనుమానాలకు దారితీసింది. అదే సమయంలో కౌశల్‌ ఆర్మీ అలర్ట్ అయ్యే ఛాన్స్ దొరికింది. మొత్తంగా.. బిగ్ బాస్ హౌస్ ఇక ఒక్కరు మాత్రమే ఎలిమినేట్ కానున్నారు. ఆ తర్వాత ఏపీసోడ్ లో బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరన్నది తెలిసిపోనుంది.