‘కెప్టెన్‌ రాజు’ ఇకలేరు

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్‌ (కెప్టెన్‌ రాజు) కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.

తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్‌ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్‌, ఇంగ్లీష్‌ భాషల్లో 500కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన దర్శకత్వంలో ‘ఒరు స్నేహగథా’, ‘పవనాయి 99. 99’ సినిమాలొచ్చాయి.

తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్‌ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు.