పరువు హత్య.. రామ్’కు మండింది !

మిర్యాలగూడ పరువు హత్య ఘటన అందరిని కలచివేస్తోంది. కూతురు (అమృత) కులాంతర వివాహం చేసుకుని తన పరువు తీసిందన్న కారణంగా కిరాయి హంతకుల చేత అల్లుడి (ప్రణయ్)ని దారుణంగా హతమార్చాడు మారుతీరావు. ఈ పరువు హత్యపై యంగ్ హీరో రామ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించాడు. “సెక్షన్ 377 కూడా ఎత్తేశారు. ఇంకా కులాలు పట్టుకుని వేలాడడం ఏంటని రామ్ మండిపడ్డాడు. కులాలు, పరువు హత్యలు ఇందిరా ఇది జంగిల్ ఫెలోస్” అంటూ రామ్ ట్విట్ చేశాడు.

అంతకుముందు సింగర్ చిన్మయి ఈ ఘటనని తీవ్రంగా ఖండించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మనవంతు ప్రయత్నంగా కులాలు నిర్ములించాలని పిలుపునిచ్చింది. పేర్ల చివర ఉండే తోకలు కట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో ఓ లేఖని విడుదల చేసింది. ఇక, హత్య చేయించిన మారుతీరావుకి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ మొదలైంది. అలా అయితే, ఇలాంటి పరువు హత్యలు రిపీట్ కాకుండా ఉంటాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.