షాకింగ్ : ప్రణయ్’ని హత్య చేసింది ఉగ్రవాదులు


మిర్యాలగూడ పరువు హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయ్. ప్రణయ్ ని హత్య చేసింది కిరాయి గుండాలు కాదట… ఉగ్రవాదులు రంగంలోకి దిగి ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్‌ బారీ అని భావిస్తుండగా తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాల ప్రకారం బారీ గురువు అస్గర్‌ అలీనే స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

నల్గొండకు చెందిన అస్గర్‌ అలీ, అతని శిష్యుడు అబ్దుల్‌ బారీ బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత స్వచ్ఛందంగా కశ్మీర్‌ వెళ్లి ఉగ్రవాద శిక్షణ తీసుకొని… ఐ.ఎం.ఎం.ఎం. సంస్థలో కీలక పాత్ర పోషించారు. ఇలాంటి వారు సుపారీ హత్యకు పాల్పడటం పోలీసులని సైతం షాక్ కి గురిచేస్తోంది. మారుతీరావును నుంచి రూ.కోటి సుపారీ తీసుకున్న అస్గర్‌ అలీ హత్యలో పాల్గొన్న వ్యక్తికి రూ.పది లక్షలు చెల్లించినట్లు తేలింది. ఇదిలా ఉంటే ప్రణయ్‌ హత్యకు సంబంధించి మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేస్తున్న విలేకర్ల సమావేశంలో ఈ వివరాలన్నీ వెల్లడించనున్నారు.