పూజతో దాసు పాటేసుకొన్నాడు

దాసు పూజతో పాటేసుకొన్నాడు. నాగ్, నానిల మల్టీస్టారర్’గా తెరకెక్కుతోన్న చిత్రం “దేవదాస్”. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇందులో నాని దాసు పాత్రలో డాక్టర్ గా కనిపించనున్నాడు. ఆయనకు జంటగా రష్మిక మందన పూజ పాత్రలో నటిస్తున్నారు. పూజని ఫస్ట్ టైం చూసినప్పుడే ఫ్లాటైపోయినట్టు దాసు ఇదివరకే చెప్పాడు. ఇప్పుడు పూజతో కలిసి దాసు పాటేసుకొన్నాడు.

మనసుని తట్టే ఈ పాటని చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. “ఏమో ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో .. ఏమో ఏమో ఏమో వెలుగు వాగు నాలో పొంగిందేమో ..” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల రాసిన ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పాటని మీరు వినేయండీ.. !