హైదరాబాద్ లో ‘నవాబ్’ వేడుక

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘చెక్క చీవంత వాణం’. తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. విజయ్ సేతుపతి, అరవింద్ సామి, జ్యోతిక, అదితీ రావు హైదరీ, ఐశ్వర్యా రాజేష్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా ఆడియోను ఇటీవల చెన్నైలో ఘనంగా నిర్వహించారు. కాగా, ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో సెప్టెంబ‌ర్ 25న ఏర్పాటు చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మ‌ణిర‌త్నం, ఎ.ఆర్‌. రెహ‌మాన్ వి‌చ్చేస్తున్నారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్‌ హౌజ్‌ సంయుక్తంగా ఈ భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ 27న సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది.