మారుతిరావుని హత్య చేయాలట !

మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్యపై సెలబ్రేటీస్ స్పందిస్తున్నారు. కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని పగబట్టిన మారుతీరావు తన అల్లుడు ప్రణయ్‌ని అతి కిరాతకంగా అంతమొందించాడు. వారం రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనపై ఇప్పటికే కథానాయకులు రామ్‌చరణ్‌, మంచు మనోజ్‌ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఓ వ్యక్తిని హత్య చేయడంలో పరువు ఉందా?’ అని ప్రశ్నించారు. ఈ ఘటనపై వర్మ శుక్రవారం ట్వీట్‌ చేశారు.

‘అమృత తండ్రి మారుతీరావు క్రూరమైన క్రిమినల్‌. ప్రణయ్‌ను చంపడం అతడికి గౌరవమా ?.. ఒకవేళ ఇది పరువు హత్య అయితే ఆయన కూడా చావడానికి సిద్ధంగా ఉండాలి. నిజమైన పరువు హత్య ఏంటంటే.. పరువు పేరుతో హత్యలు చేసే వారిని హత్య చేయడమే’ అని వర్మ పేర్కొన్నారు. దీంతో.. మారుతిరావుని ఉరి తీయాలని వర్మ డిమాండ్ పరోక్షంగా డిమాండ్ చేస్తున్నట్టు అనిపిస్తోంది.