వల్లభనేని చేతుల్లో ‘నవాబ్’ !

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘చక్క చివంత వానం’. తెలుగులో ‘నవాబ్’గా తీసుకొస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. తెరకెక్కిన విజయ్ సేతుపతి, అరవింద్ సామి, జ్యోతిక, అదితీ రావు హైదరీ, ఐశ్వర్యా రాజేష్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 28న ‘నవాబ్’ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులని అశోక్ వల్లభనేని భారీ రేట్‌కు సొంతం చేసుకొన్నారు. అశోక్ ని మంచి టేస్ట్ ఉన్న నిర్మాతగా పేరుంది. ఆయనది లక్కీ హ్యాండ్ చెబుతుంటారు. అలాంటి అశోక్ చేతుల్లోకి ‘నవాబ్’ వెళ్లడంతో.. ఈ సినిమాపై మరింత నమ్మకం పెరిగిందని ఇండస్ట్రీ చెప్పుకొంటున్నారు. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో సెప్టెంబ‌ర్ 25న జరగనుంది.