‘నవాబ్’ని తొక్కేశారు

మణిరత్నం సినిమా అంటే ఓ అందమైన అనుభూతి. ఆయన సినిమా వెండితెరపై ఓ పెయింటింగ్ లా ఉటుంది. ఆ మధ్య తన ఫాంని కోల్పోయినట్లు కనిపించిన మణిరత్నం..”ఓకే బంగారం”తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చారు.ఐతే, వెంటనే మరో ఫ్లాపు పడింది. కార్తీతో తెరకెక్కించిన ‘చెలియా’ చిత్రం ఫ్లాఫ్ అయ్యింది. అయినా మణిరత్నం సినిమాలపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు.

మణిరత్నం తాజా చిత్రం సెక్క సివంద వానం’. తెలుగులో ‘నవాబ్‌’ పేరుతో విడుదల కానుంది. అరవింద్‌స్వామి, శింబు, విజయ్‌సేతుపతి, అరుణ్‌విజయ్‌, జ్యోతిక, అతిథిరావు, ఐశ్వర్యా రాజేష్‌, ప్రకాశ్‌రాజ్‌ వంటి పెద్ద తారాగణం వుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ఐతే, రిలీజ్ ముందు నవాబ్ హవానే కనిపించడం లేదు. ప్రమోషన్స్ లో జోరే లేదు.

రేపు ‘నవాబ్’ వస్తున్నాడనే విషయాన్ని ప్రేక్షకులు మరిచిపోయినట్టున్నారు. దీనికి నవాబ్ ని పెద్దగా ప్రమోట్ చేయకపోవడం ఓ కారణం. ఇక, అదే రోజు ‘దేవదాస్’లు నాగ్, నాని నవ్వులు పంచడానికి ప్రేక్షకుల ముందుకొచ్చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ కి చేరిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దేవదాస్ లు నవాబ్ ని తొక్కేశారు.