అమితాబ్, అమీర్.. తెలుగులో మొదలెట్టారు !

బాలీవుడ్ స్టార్స్ అమితాబ్‌ బచ్చన్‌, అమీర్ ఖాన్ తెలుగులోనూ మొదలెట్టేశారు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రం “థగ్స్ ఆఫ్ హిందూస్థాన్”. కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకుడు. ధూమ్, ధూమ్ 2 సినిమాలకు రచయితగా పనిచేసిన ఆచార్య..’ధూమ్ 3’ సినిమాతో దర్శకుడిగా మరాడు. ఆయన దర్శకుడిగా రెండో సినిమాగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ తెరకెక్కుతోంది. యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సినిమాని దక్షిణాది అన్నీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ దీపావళి కానుకగా నవంబర్ 8న రిలీజ్ చేయనున్నారు. తాజాగా, తెలుగులో ప్రమోషన్స్ కూడా మొదలెట్టారు. స్వయంగా అమితాబ్, అమీర్ కలిసి ఓ ప్రమోషన్ వీడియా చేశారు. ఇప్పుడా వీడియోని చిత్రబృందం విడుదల చేసింది. ఆ వీడియోలో అమితాబ్‌, ఆమిర్‌ ఖాన్ స్వయంగా తెలుగులో మాట్లాడుతూ.. తమ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా రిలీజ్‌ అవుతుందని తెలిపారు.

ఇక, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ లో బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నరసింహారెడ్డి గురువు పాత్రలో బిగ్ బీ కనిపించబోతున్నాడు. ఇప్పటికే బిగ్ బీ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేశారు.