రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు.. కీలక పత్రాలు స్వాధీనం !

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలని స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారమ్.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈరోజు కొడంగల్‌ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈరోజు ఉదయం 9-10 గంటల మధ్య ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. ఈ దాడులపై ఆయన ఇంకా స్పందించలేదు. ఇప్పటికే టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఈ దాడులని తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఉత్తమ్ ఆరోపించారు.