రేవంత్ రెడ్డి అభిమానులు పట్టువదలడం లేదు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన ఇంట్లో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయిక్. ఈ నేపథ్యంలో అక్కడకు భారీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు చేరుకొని ఆందోళనకు దిగారు. రేవంత్‌ రెడ్డిని తమకు చూపించాలని డిమాండ్‌ చేశారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యలో రేవంత్‌రెడ్డి వచ్చి అభివాదం చేసి వెళ్లినా కార్యకర్తలు శాంతించలేదు. రేవంత్ రెడ్డికి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత సీతక్క ఆరోపించారు. ఓ భూకబ్జాదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో తనిఖీలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓటమి భయంతోనే రేవంత్‌, కాంగ్రెస్‌ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.