ఆసియా విజేత భారత్

భారత్ ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లా 48.3 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. లిటన్‌ దాస్‌ (121; 117 బంతుల్లో 12×4, 2×6) అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకొన్నాడు. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్‌ శర్మ 48, దినేశ్‌ కార్తీక్‌ 37, ధోని 36, జడేజా 23, భువనేశ్వర్‌ 21, జాదవ్‌ 23 నాటౌట్‌ రాణించారు. భారత్‌ ఆసియా కప్ గెలుచుకోవడం ఇది ఏడోసారి. లిటన్‌ దాస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, శిఖర్‌ ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యారు.