విండీస్ టూర్ : ధావన్ పై వేటు

ఆసియా కప్ లో అద్భుతంగా రాణించాడు భారత ఓపెనర్ శిఖర్ దావన్. మ్యాన్ ఆఫ్ ది టోర్నిగా నిలిచారు. ఐతే, విండీస్ టూర్ కి ధావన్ పై వేటు పడింది. అంతకుముందు ఇంగ్లాండ్ టూర్ లో ధావన్ పెద్దగా రాణించలేదు. ధావన్ తో పాటు బౌలర్లు భువనేశ్వర్‌, బుమ్రా, ఇషాంత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యలను కూడా సిరీస్‌కు దూరం పెట్టారు. విండీస్ జట్టు బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో కుర్రాళ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షాలకి అవకాశం ఇచ్చారు.

విండీస్ టూర్ కి ఎంపికైన భారత జట్టు :

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌