అక్షయ్ పై తప్పుడు ప్రచారం

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఆయన ‘కాకి మనిషి’ అని కొందరు, కాదు కాదు డాక్టర్‌ రిచర్డ్స్‌ అని మరికొందరు చెప్పుకొంటున్నారు. శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ సీక్వెల్ గా ‘2.ఓ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్.

ఈ సినిమాలో అక్షయ్ పాత్రపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అక్షయ్‌ క్రో మ్యాన్‌ (కాకి మనిషి) పాత్రలో కనిపించినున్నాడు. కాదు ఆయనది డాక్టర్‌ రిచర్డ్స్‌ అనే సైంటిస్ట్‌ పాత్ర అని రెండు రకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ ప్రచారంపై దర్శకుడు శంకర్ స్పందించారు. అక్షయ్ పాత్రపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. అందులో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ, అక్షయ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ గానే ఉంచారు.

ఇక, దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో ‘2.ఓ’ తెరకెక్కింది. రోబో అంతకుమించి విజువల్ ఎఫెక్ట్స్ ని ఇందులో చూపించబోతున్నారంట. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆ రేంజ్ లోనే ఉంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం ఎ ఆర్ రెహమాన్. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తోంది.