సాహో.. బాహుబలి అంతకుమించి !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి కబరు చెప్పబోతున్నాడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న ప్రభాస్ పెళ్లి ప్రకటన రాబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాకు గురించి మరో గుడ్ న్యూస్ వినిపించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమా ఎలా ఉండబోతుందనే టెన్షన్ ఆయన అభిమానుల్లో నెలకొంది. ఇప్పుడా అనుమానాలన్నీ పటాపంచలు చేసే న్యూస్.

నటుడు అరుణ్‌ విజయ్‌ ‘సాహో’లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన నటించిన మరో చిత్రం ‘నవాబ్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది. తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అర్జు విజయ్.. మణిరత్నం దర్శకత్వంలో నటించడం గొప్పగా అనిపించింది అన్నారు. అంతేకాదు తాను నటిస్తున్న సాహో బాహుబలి మించేలా ఉంటుందని తెలిపారు.

దాదాపు రూ. 300కోట్ల భారీ బడ్జెట్ తో ‘సాహో’ తెరకెక్కుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో యాక్షన్ హైలైట్ గా ఉండనుంది. దుబాయ్ లో చిత్రీకరించిన ఒక్క యాక్షన్ ఏపీసోడ్ కే రూ.90కోట్ల బడ్జెట్ ఖర్చు చేశారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.