‘సవ్యసాచి’ టీజర్ టాక్

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య – నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’. ఇందులో సీనియర్ హీరో మాధవన్ విలన్ గా కనిపించబోతున్నాడు. కూల్ గా ఉంటూనే హీరోనే మూడు చెరువుల నీళ్లు తాపించే పాత్ర అతనిదని చెబుతున్నారు. సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. టీజర్ లో సింగిల్ డైలాగ్ తో స్టోరీ లైన్ చెప్పే ప్రయత్నం చేశారు. ‘మాములుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం .. ఒకే శరీరం పంచుకుని పుడితే దాన్ని అద్భుతం అంటారు. అలాంటి అద్భుతానికి మొదలుని వరుసకి కనిపించని అన్నని, కడదాకా వుండే కవచాన్ని .. ఈ సవ్యసాచిలో సగాన్ని’ డైలాగ్ ఆకట్టుకుంటోంది.

‘ప్రేమమ్’ తర్వాత చైతూ-చందూ మొండేటి కలయికలో తెరకెక్కిన చిత్రమిది. మైత్రీ మూవీ బ్యానర్ పై తెరకెక్కింది.
త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఇక, ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన చైతూ ‘శైలజారెడ్డి అల్లుడు’ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఆ సినిమా హవా తగ్గకముందే సవ్యసాచి రాబోతుంది.