మావోస్టులతో టీడీపీ నేతలకు సంబంధాలు ?

మావోయిస్టులతో టీడీపీ నేతలకు సంబంధాలున్నాయన్న న్యూస్ కలకలం రేపుతోంది. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మావోయిస్టులకు స్థానికంగా ఇద్దరు టీడీపీకి చెందిన నేతలు పూర్తి సహకారం అందినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. వీరిద్దరు మావోయిస్టుల వ్యూహరచన అమలులో భాగస్వాములైనట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఇద్దరు నాయకుల్లో ఒకరు మండల స్థాయి నాయకుడు కాగా, మరొకరు గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తని తెలిసింది. ఎమ్మెల్యే కిడారికి అత్యంత విశ్వసనీయంగా వ్యవహరిస్తూనే.. మావోలకు సహకరించారు. దీంతో మావోల పని మరింత సులువైంది. ఐతే, ఈ ఇద్దరు నాయకుల వెనక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా.. ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆ ఇద్దరి నేతలని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.