వైజాగ్’లో రెండో వన్డే !

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య అక్టోబరు 24న ఇండోర్‌లో జరగాల్సిన రెండో వన్డే వేదిక మారనున్నట్టు సమాచారమ్. అది వైజాగ్‌’కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంప్లిమెంటరీ టికెట్లపై ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో ఇండోర్‌ ఆతిథ్య హక్కులను వదులుకునేందుకు మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) సిద్ధమైంది.

బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం స్టేడియంలో 90 శాతం టికెట్లను అమ్మకానికి పెట్టాలి. 10 శాతాన్ని కాంప్లిమెంటరీ పాసులుగా ఇచ్చేకునే అవకాశం ఆయా రాష్ట్ర సంఘాలకు ఉంటుంది. ఐతే అంతకుమించి కావాలని మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే వేదిక వైజాగ్ కు షిఫ్ట్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.