మరో సచిన్ దొరికాడు

భారత క్రికెట్ జట్టుకు మరో సచిన్ దొరికాడు. కెరీర్ లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న యువ క్రికెటర్ పృధ్వీ షా అదరగొడుతున్నాడు. కొద్దిసేపటి క్రితమే భారత్ – వెస్టిండీస్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ నాలుగు బంతులాడి డక్కౌట్ గా పెవీలియన్ చేరాడు. ఐతే, మరో ఓపెనర్ పృధ్వీ షా అదరగొడుతున్నాడు. కేవలం 56 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కుర్రాడిని చూస్తుంటే సచినే గుర్తొస్తున్నాడు. ఎటువైపు షాట్లు కొట్టినా సచిన్ మైదానంలో నిలిచి కొడుతున్నట్టే ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక, మరో ఎండ్ లో ఛటేశ్వర్ పుజారా 38 పరుగులతో ఆటని కొనసాగిస్తున్నాడు.