రేవంత్ రెడ్డి నుంచి సమాధానాల్లేవ్ !

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంట్ రెడ్ది మంగళవారం ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఐటీ అధికారులు రేవంత్ ని ఓటుకు నోటు కేసుపై ఎక్కువ ప్రశ్నలు సంధించినట్టు తెలిసిందే. ఈ వ్యవహారంలో స్టీవెన్ సన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడివి ? ఎక్కడ్నుంచి వచ్చాయి అనే ప్రశ్నలు సంధించారు. ఐతే, వీటిపై రేవంత్ సమాధానం తెలీదు, గుర్తులేదు అని సమాధానమిచ్చినట్టు తెలిసింది. రేవంత్ బంధువుల పేర్లతో ఉన్న వ్యాపార సంస్థలు, వాటి లావాదేవీలపై అడగగా.. తాను నిత్యమూ రాజకీయాల్లో తిరుగుతూ, ప్రజలను కలిసే పనిలో బిజీగా ఉంటానని, తన బంధువుల్లో ఎవరు ఏ కంపెనీలు నడుపుతున్నారన్న విషయాలపై తనకు అవగాహన చాలా తక్కువని రేవంత్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.