పెన్షన్ పెంపు.. అర్రాస్ మొదలైంది !

తెలంగాణలో పెన్షన్ పెంపుపై అర్రాస్ మొదలైంది. తాము అధికారంలోకి వస్తే ఫించన్ రూ. 2000 ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం జరిగిన నిజామాబాద్ టీఆర్ఎస్ ఆశ్వీరాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. రూ. 200 ఉన్న పెన్షన్ ని రూ. 1000కి పెంచిన ఘనత మాది. ఇప్పుడేమో కాంగ్రెస్ రూ. 2000 ఇస్తామని అర్రాస్ పాట మొదలెట్టింది. మేము రూ. 2200 ఇస్తామంటే కాంగ్రెస్ ఏం జేస్తుందని ప్రశ్నించారు. అదే సమయంలో తాము పెన్షన్ ని పెంచబోతున్నాం. దానిపై చర్చింది మానిఫెస్టోలో ఉంచుతామని తెలిపారు కేసీఆర్. కేసీఆర్ ది పెద్ద చేయినే కాబట్టి.. కేసీఆర్ పాట రూ. 2200 ఉంటుందని పెన్షన్ దారులు ఆశపడుతుర్రు.