భారత్ చేతిలో విండీస్ చిత్తు చిత్తుగా

భారత్ చేతిలో వెస్టిండీస్ చిత్తు చిత్తుగా ఓడింది. రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 649/9 (డిక్లేర్‌ ) భారీ స్కోర్ చేసిన సంగతి తెలిసిందే. పృధ్వీ షా, విరాట్ కోహ్లీ, రవింద్ర జడేజాలు సెంచరీలు సాధించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ 181 పరుగులకే కుప్పకూలి ఫాలోఆన్‌ ఆడింది.రెండో ఇన్నింగ్స్ లోనూ విండీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (5/57), రవీంద్ర జడేజా (3/35) చెలరేగడంతో ఫాలోఆన్‌లో 196 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇన్నింగ్స్‌ 272 పరుగుల తేడాతో భారత్ గెలుపుపొందింది.