సైకో దర్శకుడు మోసం చేశాడట


సైకో దర్శకుడు మోసం చేసిన ఘటన కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ సైకో దర్శకుడు ఎవరు ? ఆయన ఎవరిని, ఎలా మోసం చేశాడో తెలుసా ? వివరాల్లోకి వెఌతే.. ‘సవరకత్తి’, ‘తుప్పరివాలన్‌’ (తెలుగులో ‘డిటెక్టివ్’) సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు ‘మిస్కిన్’. ప్రస్తుతం ఈ దర్శకుడు ఉదయనిధి హీరోగా ‘సైకో’ అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇందులో అతిథిరావు, నిత్యామేనన్‌లు కథానాయికలు. పోలీసు అధికారి పాత్రలో దర్శకుడు రామ్‌ నటిస్తుండటం విశేషం. ఐతే, ‘సైకో’ కథని మిస్కిన్ 2015లోనే రెడీ చేసుకొన్నాడట.

అప్పట్లో ఈ కథని నటుడు మైత్రేయ వినిపించాడట. మైత్రీయ తండ్రి నుంచి అడ్వాన్స్ రూపంలో కొంత అడ్వాన్సుగా తీసుకొన్నాడట. అయితే ‘సవరకత్తి’, ‘తుప్పరివాలన్‌’ సినిమాల కోసం కొంత సమయం కావాలని అడిగారట. ఈ రెండూ పూర్తయ్యాక ‘సైకో’ను ప్రారంభించనున్నట్లు తెలిపినట్టు మైత్రీయ ఆరోపిస్తున్నారు. ఇప్పుడేమో.. ‘సైకో’ని ఇతర నటులతో తీస్తున్నారు. దీని గురించి మిస్కిన్ ని ప్రశ్నిస్తే.. ‘మీతో సినిమా చేయడం వీలుకాదు. అడ్వాన్స్‌ కూడా ఇవ్వలేను’ అని చెబుతున్నారు. చాలా మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించమని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని మిష్కిన్‌ విజ్ఞతకే వదిలేస్తున్నా’మన్నారు ఆత్రీయ.