నానా నోరు మూయించేశాడట !

బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా-నానా పటేకర్ ల వివాదానికి ఇప్పట్లో పులిస్టాప్ పడేలా లేదు. ఈ వివాదంలో ఇప్పటికే నానా తనుశ్రీకి నోటీసులు పంపించడం, ఆయనపై తనుశ్రీ పోలీసులకి ఫిర్యాదు చేయడాలు జరిగిపోయాయి. ఇలాంటి సమయంలో నానా ప్రెస్ మీటు పెట్టబోతున్నట్టు ప్రకటించారు. సోమవారం (అక్టోబర్ 8) సాయంత్రం ప్రెస్ మీట్ అంటూ మీడియాకు సమాచారం కూడా అందించారు. దీంతో.. ఈ వివాదంపై కొంత క్లారిటీ రానుందని అందరు బావించారు. ఐతే, ఆఖరి నిమిషంలో నానా ప్రెస్ మీటుని క్యాన్సిల్ చేసుకొన్నాడు. దీనికి గల కారణాలేంటీ? మీడియాని చూసి నానా ఎందుకు భయపడుతున్నారనే అనే డౌటు వచ్చింది.

దీనిపై నానా క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు ప్రెస్ మీటు క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్లిన నానా అక్కడ మీడియాతో రెండు మూడు ముచ్చట్లు మాట్లాడారు. ‘మా లాయర్‌ నన్ను తనుశ్రీ విషయమై ఏమీ మాట్లాడొద్దన్నారు. అందుకనే ఈ విషయం గురించి బయటకు మాట్లాడలేదు. నేను పదేళ్ల క్రితం చెప్పిందే ఇప్పుడూ చెబుతున్నాను. ఎందుకంటే పదేళ్లయింది కదా అని నిజం మారిపోదు కదా’ అన్నారు నానా. మొత్తానికి లాయర్ నానా నోరు మూయించాడన్న మాట. ఆ మూసిన నోటిని నానా ఎప్పుడు తెరుస్తాడో.. ఈ వివాదానికి పులిస్టాప్ పెడతారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.