త్రివిక్రమ్ కడుపు నింపేశాడు


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు కడుపు నింపేశాడబ్బా.. అని చెప్పుకొంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు. అది నిజమే. తారక్ గొప్పదనం త్రివిక్రమ్ మాటల్లో వినాలని అభిమానులు ఆశపడ్డారు. అది ‘అరవింద సమేత’ ప్రీ-రిలీజ్ వేడుకతోనే తీరుతుందని అనుకొన్నారు. కానీ, త్రివిక్రమ్ ఘోరంగా నిరాశపరిచారు. కొన్ని సార్లు మాట్లాడకపోవడమే మంచిది. ప్రస్తుతం నాది అదే పరిస్థితి అంటూ.. చిత్రబృందానికి కృతజ్ఝతలు తెలిపి సింపుల్ గా ముగించేశాడు. ఇప్పుడా లోటుని తీర్చేశాడు. తారక్ ఫ్యాన్స్ కండుపు నింపేశాడు త్రివిక్రమ్.

దసరా కానుకగా గత గురువారం (అక్టోబర్ 11)న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’డిని బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు ప్రేక్షకులు. కేవలం 4రోజుల్లోనే రూ. 100కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఓవర్సీస్ లోనూ 1.5మిలియన్ డాలర్లు దాటేశాడు. అక్కడ వరుసగా ఎన్టీఆర్ నాలుగు సినిమాలు ఈ మార్క్ ని అందుకొన్నాయి. మరే టాలీవుడ్ స్టార్ అందుకోని ఫీట్ ఇది. ఈ నేపథ్యంలో ఆదివారం చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీటు నిర్వహించింది. ఈ వేదికగా తారక్ గొప్పదనం త్రివిక్రమ్ మాటల్లో వినే భాగ్యం దక్కింది.

“ఈ సినిమాని మొదలు పెట్టడానికి, పూర్తి చేయడానికీ, నాలుగు రోజుల్లోనే రూ.వంద కోట్లు సాధించడానికి కారణం ఎన్టీఆరే. ఎలాంటి కష్టమైన సన్నివేశమైనా సరే ఆ క్షణంలోనే నటించడం తారక్ కు ఉన్న గొప్ప లక్షణం. తాత పేరు నిలబెట్టడమే కాదు ఆయన స్థాయి అందుకోగలిగే సత్తా, అంత ప్రయాణం, అంత వయసున్న నటుడు ఎన్టీఆర్” అన్నారు త్రివిక్రమ్. ఈ మాటలతో తారక్ అభిమానుల కడుపు నిండిపోయింది. అదే సమయంలో త్రివిక్రమ్ పై తారక్ చూపించిన ప్రేమ ఆకట్టుకుంటోంది. ఎన్ని బంధాలతో పిలిచినా పలికే ఆత్మీయుడు త్రివిక్రమ్‌ అన్నారు తారక్. ఇక, వీర రాఘవుడి ప్రతాపం ఇప్పట్లో ఆగిలేలా లేదు. పండగ వచ్చి పోయినా.. !