ఏపీకి విజయ్ సాయం రూ. 5లక్షలు

యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండది పెద్ద మనసు. అది మరోసారి రుజువైంది. ఇటీవల కేరళ వరదల నేపథ్యంలో.. తనవంతు సాయం చేశాడు విజయ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేష్ శ్రీకాకుళం తిత్లీ తుఫాన్ బాధితులకి తన వంతుగా రూ. 5లక్షల సాయం చేశాడు. ఈ మొత్తాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ట్రాస్ ఫర్ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

“లేహ్‌లో ఉన్న నాకు ఇప్పుడే తిత్లీ తుఫాన్ విషయం తెలిసింది. ప్రస్తుతం మన సొంత ప్రాంతంలో సమస్య వచ్చింది. పెద్ద మనసుతో ఎంత ఇచ్చినా పెద్ద సాయం అవుతుంది. గతంలో కేరళకు సాయం చేశారు. ఇప్పుడు మనవాళ్లకు సాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని” విజయ్ పేర్కొన్నారు.

ఇక, అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు విజయ్. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ ‘నోటా’ మాత్రం ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రెడ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులోనూ విజయ్ సరసన రష్మిక మందన జతకట్టనుంది. ఇక, క్రాంతి మాధవన్ దర్శకత్వంలో విజయ్ నటించనున్న సినిమా దసరా పండగ (అక్టోబర్ 18) రోజున ప్రారంభం కానుంది.