షాక్ : మావోయిస్టుల టార్గెట్’లో కేటీఆర్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలయ్యాయి. ఇటీవల అర‌కు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ‌లను మావోలు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దార్యాప్తులో భాగంగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మావోల లిస్టులో ఏపీకి చెందిన మరికొందరు నేతలు ఉన్నట్టు తెలిసింది. దీనికితోడు కిడారి, సివేరు హత్య కోసం మావోల ప్లాన్ షాక్ కి గురిచేసింది. టీడీపీ నేతలని వారు చాలా తెలివిగా వాడుకొన్నట్టు తెలిసింది.

ఏపీ నేతలే కాదు.. తెలంగాణ నేతలు మావోల లిస్టులో ఉన్నట్టు సమాచారమ్. ఇందులో మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారంట. ఇప్పటికే కేటీఆర్ హత్య కోసం పక్కా ప్లాన్ ని రెడీ చేసుకొన్నట్టు తెలిందట. తాజాగా రాజ‌న్న సిరిసిల్ల జిల్లా తెరాస పార్టీ ప్రచారంలో భాగంగా కేటీఆర్ ప‌ర్య‌ట‌న చేశారు. ఈ నేపథ్యంలో తంగెళ్ల‌ప‌ల్లి మండ‌లం జిల్లెల్లలో పోలీసులు త‌నిఖీలు చేస్తుండగా జ‌న‌శ‌క్తి విప్ల‌వ పార్టీ జిల్లా కార్య‌ద‌ర్శి జ‌క్కుల బాబు, మ‌రో మావోయిస్టు శ్రీకాంత్ పోలీసులకు పట్టుబడ్డారు.

వీరి నుంచి సెమీ ఆటోమెటిక్ రివాల్వ‌ర్, బెల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించిన పోలీసులకి షాకింగ్ నిజాలు తెలిసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ హత్య కోసం మావోలు రెక్కీ నిర్వహించారట. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేటీఆర్ తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీకి చెందిన చాలామంది మావోల హెడ్ లిస్టులో ఉన్నట్టు సమాచారమ్. అసలే ఎన్నికల కాలం.. గ్రామాల్లో నేతలు తిరగక తప్పని పరిస్థితి. మరీ.. మావోల వ్యూహాలని తెలంగాణ పోలీసులు ఎలా తిప్పికొడతారో చూడాలి.