రకుల్ దర్శకుడు వేధించాడట

బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా ప్రారంభించిన #మీటూ ఉద్యమం ఉవ్వెత్తుల ఎగిసిపడుతోంది. ఇప్పుడిది అన్ని రంగాలకు వ్యాపించింది. సినీ, రాజకీయ, కార్పోరేటు, క్రీడారంగం.. అన్నింటా వేధింపులు ఉన్నాయని స్పష్టమవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘దేదే ప్యార్‌ దే’. ఈ చిత్ర దర్శకుడు లవ్‌ రంజన్‌పై కూడా లైగింక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీనిపై రకుల్ అడిగితే.. ‘బాధిత మహిళల మాటలను ప్రజలు వింటున్నారు. కొంతమంది శిక్షించ బడుతున్నారు కూడా. రాబోయే కాలంలో వర్క్‌ ప్లేస్‌ మరింత సౌకర్యంగా ఉండాలంటే ‘మీటూ’ ఉద్యమం మిస్‌ యూజ్‌ కాకూడదు’’ చెప్పుకొచ్చింది రకుల్.

ఇక, టాలీవుడ్, కోలీవుడ్ లో సత్తా చాటిన రకుల్ బాలీవుడ్ లో పాగ వేయాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కథాబలం ఉన్న సినిమాల్లోనే నటిస్తానని చెబుతోంది. ప్రస్తుతం ఆమె అతిలోక సుందరిగా మారిపోయింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్ టీఆర్ బయోపిక్ లో రకుల్ శ్రీదేవి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆమె భారీ రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఇదీగాక.. తారక్-చరణ్ ల మల్టీస్టారర్ కోసం రకుల్ పేరు వినిపిస్తోంది. ఆ అవకాశం కొట్టేస్తే రకుల్ రేంజ్ మరింత పెరిగినట్టే.. !