కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 6గురు మృతి !

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. ఆలూరు మండల పరిధిలోని పెద్దహోతూరు సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు యువకులు, ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 21మంది ప్రయాణిస్తున్నారు. చిన్నారికి పుట్టు వెంట్రుకలు తీయించేందుకు వెళ్తుండగా ఈ ప్రచారం చోటు చేసుకొంది.