పార్టీ మారే ముచ్చట చెప్పిన కడియం

తెలంగాణ డిప్యూటీ సీఎం, మంత్రి కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు. ఆయన్ని యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉంచడమే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది. ఇదీగాక, కేసీఆర్ వ్యవహార శైలిపై కడియం అసంతృప్తితో ఉన్నాడని చెప్పుకొన్నారు. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంపై కడియం సైలైంట్ గా ఉండటంతో.. అది నిజమేననే ప్రచారం ఊపందుకొంది. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ మారే ప్రచారంపై స్పందించారు కడియం.

‘తనపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. తాను పార్టీని వీడి.. మరో పార్టీలో చేరే అవకాశమే లేదన్నారు’ కడియం. మరీ.. ఇప్పటికైనా కడియం పార్టీ మారే ప్రచారానికి పులిస్టాప్ పడుతుందా ? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ? ఇలా ఖండించిన నేతలు పార్టీ మారిన సందర్భాలని చాలానే చూశారు. కడియం మళ్లీ ఎప్పటిలాగే ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటే అప్పుడు జనాలు కడియం టీఆర్ ఎస్ లోనే కొనసాగనున్నారని ఫిక్సయిపోతారు. లేదంటే కడియంని గోడమీద పిల్లిలానే చూసే అవకాశం ఉంది మరీ !