మహేష్ కూతురు బాలీవుడ్’కు వెళ్లింది !

సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార బాలీవుడ్ కు వెళ్లింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ పిక్ ని చూసి మహేష్ బాబు అభిమానులు ఇదే చెప్పుకొంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ కలిసి సితార దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం మహేశ్‌ ‘మహర్షి’ సినిమా షూటింగ్‌ న్యూయార్క్‌లో జరుగుతోంది. అక్కడికి ఆయన తన కుటుంబంతో కలిసి వెళ్లారు. షూటింగ్‌ విరామ సమయంలో మహేశ్‌ పిల్లలతో కలిసి న్యూయార్క్‌ వీధుల్లో విహరించారు

ఆ సమయంలో సితార తన అభిమాన నటి అలియా భట్‌ను కలిశారు. ఆమెతో కలిసి ఫొటోకు పోజిచ్చింది. దీన్ని నమ్రత తన ఇన్ స్ట్రోగ్రామ్ లో షేర్‌ చేస్తూ.. ‘సితారకు ఇష్టమైన అమ్మాయి. తన ముఖంలోని చిరునవ్వుకు కారణమైనందుకు ధన్యవాదాలు అలియా’ అని రాశారు. ఇప్పుడీ ఫోటోని చూసి మహేష్ అభిమానులు మురిసిపోతున్నారు. సితార బాలీవుడ్ కు వెళ్లిందని సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇక, న్యూయార్క్ లో అలియాని సితార కలిసినప్పుడు పక్కన రణ్ బీర్ కపూర్ కూడా ఉన్నాడట.