#2.O : ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. !

శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ సీక్వెల్ గా రోబో ‘2.O’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రూ. 543 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఈ సినిమాని నవంబర్ 29న రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

తాజాగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘ఎందిరా గతు సుందరియా.. ‘ అంటూ సాగే లిరికల్ సాంగ్ అదిరిపోయింది.
మధన్ కర్కీ రాసిన ఈ పాటని సిద్ శ్రీరామ్, షాశా తిరుపతి పాడారు. రెహమాన్ సంగీతం అందించారు. ఐతే, ఈ సాంగ్ ని శంకర్ తెరపై ఎంత అద్భుతంగా చూపించబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడీ సాంగ్ లిరికల్ వీడియోని చూసి ఎంజాయ్ చేయండీ.. !