చైతూ కోసం గౌతమ్‌ మీనన్ సినిమా

గౌతమ్‌ మీనన్, శింబు, ఏఆర్ రెహమాన్‌’లది హిట్ కాంబో. వీరి కలయికలో వచ్చిన విన్నైత్తాండి వరువాయా, అచ్చమ్‌ ఎన్‌బదు మడమయడా లాంటి సూపర్ హిట్ సినిమాలొచ్చాయ్. ఇప్పుడు వీరి కలయికలో హ్యాట్రిక్ చిత్రం రాబోతుంది. ఇది మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ గా ఉండబోతుందట. ఈ సినిమా కోసం కలిసినప్పుడు గౌతమ్‌ మీనన్, శింబు, ఏఆర్ రెహమాన్ తీసుకొన్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ? విన్నైత్తాండి వరువాయా, అచ్చమ్‌ ఎన్‌బదు మడమయడా సినిమాలు తెలుగులో నాగ చైతన్య హీరోగా ఏ మాయ చేశావె, సాహశం శ్వాసగా సాగిపో’గా వచ్చాయి. ఇప్పుడు మూడో చిత్రం కూడా చైతూతో ఉండనుందా ? లేదా.. ?? అన్నది తెలియాల్సి ఉంది. ఐతే, ప్రేమకథా చిత్రాలు చైతూకి బాగా నప్పుతాయి. మాస్-యాక్షన్ ఎంటర్ టైనర్స్ ఆయనకి పెద్దగా కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్ సినిమాపై చైతూ పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని చెబుతున్నారు.

ఇక, ‘శైలజారెడ్డి అల్లుడు’గా ఆకట్టుకొన్న చైతూ.. ‘సవ్యసాచి’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నవంబర్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమమ్ తర్వాత చందూ మొండేటి-చైతూ కలయికలో తెరకెక్కిన చిత్రమిది. నిధి అగర్వాల్ హీరోయిన్. ఇందులోమాధవన్, భూమిక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం చైతూ-సామ్ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘మజిలీ’ టైటిల్ పరిశీలనలో ఉంది. పెళ్లి తర్వాత చై-సామ్ నటిస్తున్న తొలిచిత్రమిది.