అమ్మకానికి రోబో ‘2.O’ పోటీలో 10 మంది !

శంకర్ దర్శకత్వంలో ‘రోబో’ సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం రోబో ‘2.O’. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రమిది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నారు. ఎమీ జాక్సన్ హీరోయిన్. ఈ సినిమాని నవంబర్ 29న రిలీజ్‌ చేయబోతున్నారు. ఇప్పుడీ సినిమాని అమ్మకానికి పెట్టేశారు. ఇందులో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ వంటి సాంకేతిక పరిజ్ఙానం హాలీవుడ్‌ చిత్రాలను తలదన్నేలా ఉండబోతున్నాయి. ఎంత ఆలస్యమైన విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో దర్శకుడు శంకర్ రాజీపడలేదు.

ఇప్పటికే విడుదలైన ఫోటోలు, టీజర్, లిరికల్ వీడియోస్ సాంగ్స్ చూస్తే 2.ఓ రేంజ్ ఏంటన్నది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొనేందుకు విపరీతమైన పోటీ ఏర్పడింది. ఒక్కో ఏరియాకు 10 మంది చొప్పున బయ్యర్లు పోటీ పడుతున్నారని సమాచారమ్. ఈ నేపథ్యంలో ఏరియావారీగా సినిమా హక్కుల కోసం వేలం పద్దతిలో అమ్మకాలు జరపడానికి చిత్రబృందం రెడీ అయినట్టు తెలుస్తోంది. దీంతో.. 2.ఓ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్’లో జరగనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాదాపు రూ. 1000కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరగనుందని అంచనా వేస్తున్నారు.