బాలీవుడ్ సినిమాలో నాని, శర్వా !

ఓ బాలీవుడ్ సినిమా కోసం టాలీవుడ్ యంగ్ హీరోలు నాని, శర్వానంద్ పేర్లు వినబడుతున్నాయి. రాజ్‌కుమార్‌ రావు‌ ‘షాదీ మే జరూర్‌ ఆనా’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారట. ఈ సినిమా తెలుగు రీమేక్‌ రైట్స్ ని నిర్మాత అనిల్‌ సుంకర తీసుకొన్నారని తెలిసింది. నాని లేదా శర్వాతో ఈ రిమేక్ ఉండబోతున్నట్టు సమాచారమ్.

ప్రస్తుతం ఈ రిమేక్ కి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది. ‘షాదీ మే జరూర్‌ ఆనా’ చిత్రంలో కృతి కర్బంద హీరోయిన్ గా నటించారు. మరీ.. తెలుగులో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. ప్రస్తుతం నాని ‘జెర్సీ’ సినిమాతో.. శర్వానంద్‌ ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో బిజీగా ఉన్నారు. మరీ.. బాలీవుడ్ రిమేక్ కోసం వీరిద్దరిలో ఎవరు ఓకే చెబుతారో చూడాలి.