సుశాంత్ హీరోయిన్ యూటర్న్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుశాంత్ ‘కీజీ ఔర్‌ మానీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో నటుడు ముకేశ్‌ చాబ్రా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇందులో సుశాంత్ జంటగా సంజనా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ సంజనని సుశాంత్ లైంగికంగా వేధించాడనే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.

దీనిపై సుశాంత్ కూడా స్పందించారు. సంజనాతో జరిపిన ఫోన్ చాటింగ్ వివరాల స్కీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
తన నిజాయితీ నిరూపించుకొనే ప్రయత్నం చేశాడు. తాజాగా, ఈ విషయంపై సంజన స్పందించింది. ‘యూఎస్‌ ట్రిప్‌ నుంచి నిన్ననే తిరిగి వచ్చాను. కీజీ ఔర్‌ మానీ సెట్లో నేను వేధింపులకు గురయ్యానని వార్తలు వస్తున్నాయి. నిజానికి అలాంటి సంఘటనలేమీ జరగలేదు. అవన్నీ అబద్ధాలే. ఇక వాటికి స్వస్తి పలికితే మంచిది’ అంటూ ట్వీట్‌ చేసింది సంజన.

నిజంగానే సంజన వేధింపులకి గురికాలేదా.. ? లేదంటే ఆమె యూటర్న్ తీసుకొన్నారా.. ?? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. మరీ..సంజనని సుశాంత్ ని వేధిస్తున్నాడని పని గట్టుకొని ప్రచారం చేయాల్సిన పని ఎవరికి ఉంది. మొత్తంగా సుశాంత్-సంజన ఏపీసోడ్ పెద్ద పుకారుగా మిగిలిపోయింది.