చంద్రబాబుపై నోరు చేసుకొన్న హోంమంత్రి !

తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు చేసుకొన్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబు హస్తం ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు నాయిని. ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాడెండ్ గా దొరికిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన జైలుకి కూడా వెళ్లొచ్చారు. ప్రస్తుతం బెయిల్ పై బయట తిరిగుతున్నారు.

ఈ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు హస్తం కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి బయటికొచ్చిన వీడియో టేపులో ఫోన్ లో మాట్లాడింది చంద్రబాబునే అనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన ఆడియో టేపు ఫోరెన్సిక్ టెస్టులోనూ చంద్రబాబు వాయిస్ రుజువైందని వార్తలొచ్చాయ్. ఐతే, ఈ రిపోర్టుని మాత్రం ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఆ సాకుతోనే ఇటీవలే నేను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు గతి ఏమైతది ? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని చెప్పుకొంటుంటారు.

ఇప్పుడు నాయిని కామెంట్స్ కూడా దానికి తగ్గట్టుగానే ఉన్నాయి. మరీ.. తెలంగాణ ప్రభుత్వం దగ్గర చంద్రబాబు దోషి అనే ఆధారాలుంటే ఎందుకు బయటపెట్టడం లేదు. దానికి ఏమైనా ముహూర్తం కావాలా.. ? లేదంటే పొలిటికల్ గా అవసరం వచ్చినప్పుడు వినియోగించుకొంటారా.. ?? అన్నది చూడాలి.

మరోవైపు, ఇటీవలే నాయిని చేసిన కామెంట్స్ పక్కగా ఉండటం లేదు. ఇటీవల ఆయన ఎన్నికల ఖర్చు కోసం తనకి కేసీఆర్ రూ. 10కోట్లు ఇస్తాడని చేసిన కామెంట్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత అది పొరపాటున రూ. 10లక్షలు అనబోయి.. 10కోట్లు అన్నానని తెలివిగా తప్పించుకొన్నారు. ఇప్పుడు బాబుపై చేసిన కామెంట్స్ ఇలాంటివేనేమో… !