ఆ ఇద్దరు చైతూని తొక్కేశారు !

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య మంచి ప్రేమికుడు. ఆయన ప్రేమ తెరమీద, తెర వెనక కూడా సక్సెస్ అయ్యింది. ప్రేమకథా చిత్రాలకు బాగా సూటయ్యే చై.. సమంతని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు ఆదర్శ దంపతులుగా జీవిస్తున్నారు. ఐతే, తెరపై ఎక్కువగా ప్రేమికుడిగా మెప్పించిన చైతూ.. మాస్, యాక్షన్, ఫ్యామిలీ హీరోగా కూడా రాణించాలని తాపత్రయ పడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఎంచుకొన్న చిత్రం ‘సవ్యసాచి’. చందూమొండేటి దర్శకుడు. మైత్రీ మూవీస్ నిర్మించింది.

దీపావఌ కానుకగా ‘సవ్యసాచి’ నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించారు. ఈ వేడుకకి యూత్ మెగాస్టార్ విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఆయనతో పాటు సవ్యసాచిలో కీలక పాత్రలో నటించిన మాధవన్ కూడా విచ్చేశారు. వేడుకలో వీరిద్దరిపైనే ఫోకస్ ఎక్కువైంది. ఇది చూసిన కొందరు అక్కినేని అభిమానులు విజయ్, మాధవన్ చైతూని తొక్కేశారని చెప్పుకొంటున్నారు. మరికొందరు అక్కినేని అభిమానులు మాత్రం వారిద్దరూ కూడా చై సినిమా చాలా బాగా ప్రమోట్ చేశారు. ఈ ఎఫెక్ట్ సవ్యసాచి ఓపెనింగ్ కలెక్షన్స్ లో కనబడుతుందని చెప్పుకొంటున్నారు.

ఈ వేడుకలో చైతూ గురించి విజయ్ దేవరకొండ చెప్పిన చెప్పిన మాటలకు అక్కినేని అభిమానులు మురిసిపోయారు. ఎందుకో.. చైతూ చాలా నచ్చుతాడు. ఆయన్ని తొలిసారి అన్నపూర్ణ స్టూడియో చూశా. అది ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్న ‘జోష్’ సినిమా సమయంలోనని చెప్పుకొచ్చాడు. ఇక, ఈ చిత్రంలో చైతూ సరసన నిధి అగర్వాల్ జతకట్టింది. మాధవన్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. నేరుగా తెలుగులో మాధవన్ నటించిన తొలి కావడం విశేషం. కీరవాణి సంగీతం.