కేటీఆర్’కు జేపీ ప్రశంస


తెలంగాణలో నివసించే ఆంధ్రా ప్రజలకి తాను వ్యక్తిగతంగా అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఏపీ రాజకీయ నేతలని తప్పక విమర్శిస్తాం. వాటిని అక్కడ ప్రజలకి అట్టగట్టడం తప్పు. తెలంగాణలో నివసించే ఆంధ్ర ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకొనే బాధ్యత తనదని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు.

తెలుగు రాష్ట్రాల ప్రజల సఖ్యతపై కేటీఆర్ చక్కగా మాట్లాడారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు జేపీ. పార్టీలు రాజకీయ లబ్ధి కోసం ప్రజలను విభజించడం సరికాదు. కుల, మత, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలు గుడ్డిగా పార్టీలకు ఓటు వేయడం మంచిది కాదని హితవు పలికారు. జేపీ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్… జేపీ గారికి ధన్యవాదాలంటూ రీట్విట్ చేశారు.