అసలు విలన్ అక్షయ్ కాదట !

శంకర్ ‘2.ఓ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రేంజ్ లో తీర్చిదిద్దారు. ఇందులో అసలు విలన్ అక్షయ్ కుమార్ కాదట. ఆయన కంటే ముందు ఆ పాత్ర కోసం ఇద్దరిని అనుకొన్నారంట శంకర్. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ ని సంప్రదించారట. శంకర్ ‘ఐ’ ఆడియో వేడుకకి హారజైన సమయంలో ‘2.ఓ’ పాత్ర కోసం ఆర్నాల్డ్ ని సంప్రదించారట. ఆయన నో చెప్పడంతో కమల్ హాసన్ ని అనుకొన్నారట.

ఈ విషయాన్ని ఇటీవల ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్ తెలిపారు. కమల్ ‘2.ఓ’లో నటించడం కంటే ‘భారతీయుడు 2’ నటించేందుకు ఆసక్తిని చూపారట. దీంతో ఆ అవకాశం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ దక్కిందని తెలిపాడు శంకర్. అది కూడా విచిత్రంగా జరిగింది. లైకా ప్రొడక్షన్ అక్షయ్ కుమార్ తో ‘కత్తి’ రిమేక్ తీసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ‘2.ఓ’ కథ విన్న అక్షయ్ విలన్ పాత్ర చేసేందుకు ఒప్పుకొన్నారు. సినిమాలో రజనీ పాత్రకు సమానంగా అక్షయ్ పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు శంకర్.

దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో ‘2.ఓ’ తెరకెక్కింది. ఈ నెల 29 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ లో వేగం పెంచింది. సినిమా పోస్టర్స్ క్యూ కడుతున్నాయి. రేపు (నవంబర్ 3) ట్రైలర్ రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ పీక్స్ చేరనున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు రూ. 1000కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్టు సమాచారమ్. మరీ.. చిట్టి మరోసారి తెరపై హవా చూపించగలిగితే ఈజీగా రూ. 2000కోట్ల వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.