ఆ థియేటర్స్ లో ‘సర్కార్’.. 24గంటల పాటు ఆటలు !

విజయ్-మురగదాస్’లది హిట్ కాంబో. ఈ హిట్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సర్కార్’. దీపావళి కానుకగా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సర్కార్’ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లో విడుదల కాబోతుంది. దాదాపు 80 దేశాల్లో 3000 థియేటర్స్ పైనే ప్రదర్శించబడనుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘సర్కార్’ 600 థియేటర్స్ లో ప్రదర్శితం కానుంది. ఈ రేంజ్ లో విడుదల కాబోతున్న సర్కార్ రికార్డు స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.

అంతేకాదు.. కొన్ని థియేటర్స్ లో సర్కార్ ఏకంగా 24గంటల పాటు ప్రదర్శించబడనుంది. త్రిసూర్‌లోని కార్తీక థియేటర్‌, చెన్నైలోని రోహిణి థియేటర్‌లో సర్కార్ 24గంటల పాటు ప్రదర్శించబడనుంది. వీటితో పాటు మరికొన్ని థియేటర్స్ లో అనుపతి కోసం చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్టు సమాచారమ్. ఇలా ఓ సినిమా థియేటర్స్ లో 24గంటల పాటు షోస్ పడటం ఇదే తొలిసారి. ఇక ఈ చిత్రంలో సమకాలీన రాజకీయాలని ప్రస్తావించబోతున్నారు మురగదాస్. దీంతో రాజకీయవర్గాల్లోనూ సర్కార్ పై ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించింది. హీరోయిన్ వరలక్ష్మి కీలక పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది.