రాజమౌళి మల్టీస్టారర్.. గెస్ట్ పాత్రలో ప్రభాస్ !


ఎన్టీఆర్, చరణ్’లతో రాజమౌళి మల్టీస్టారర్ (#RRR వర్కింగ్ టైటిల్) కు ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ నెల 11న 11గంటలకు సినిమాని ప్రారంభించబోతున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నట్టు సమాచారమ్. ‘బాహుబలి’ సినిమాతో రాజమౌళితో ప్రభాస్ కు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. ఒక్క మాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యులుగా మారిపోయారు. ఈ నేపథ్యంలో రాజమౌళి పిలిస్తే ప్రభాస్ రాకుండా ఉంటారా ? అందుకే #RRR లాంచ్ వేడుకకి ప్రభాస్ వస్తున్నాడట. దీంతో పాటు సినిమాలోనూ ప్రభాస్ గెస్ట్ పాత్రలో మెరిసే అవకాశాలున్నట్టు సమాచారమ్.

‘బాహుబలి’ సినిమా ప్రభాస్ ని ఇంటర్నేషనల్ స్టార్ ని చేసిన ఘనత రాజమౌళి ది. ‘బాహుబలి’ అంతకుమించి ‘బాహుబలి 2’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇక, బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా ఆ రేంజ్ సినిమాలని ప్లాన్ చేసుకొన్నాడు. ప్రస్తుతం ‘సాహో’తో పాటు రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు కూడా బాహుబలి రేంజ్ లో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు.

ఇక, #RRR మల్టీస్టారర్ 1920 నాటి నేపథ్యంలో తెరకెక్కనుందని చెబుతున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు. అందులో ఒకరు ఫారిని బ్యూటీ అని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్, చరణ్ లు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. తొలి షెడ్యూల్ తొలి పది రోజులు తారక్, చరణ్ లతో ప్లాన్ చేసినట్టు సమాచారమ్. ఈ నెల 11న ప్రారంభోత్స వేడుకలో రాజమౌళి సినిమా విశేషాలని వెల్లడించనున్నారు.