మహేష్ కథతో విజయ్ దేవరకొండ సినిమా ?


దర్శకుడు సుకుమార్ వరుసగా స్టార్ హీరోలని లైన్ లో పెడుతున్నట్టు సమాచారమ్. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ కు కూడా కథ చెప్పి ఒప్పించాడట. ఇప్పుడీ లిస్టులో యూత్ స్టార్ విజయ్ దేవరకొండ చేరిపోయినట్టు సమాచారమ్. అదికూడా మహేష్ బాబు కోసం రాసుకొన్న కథని విజయ్ దేవరకొండకు చెప్పి ఓకే చేయించుకొన్నాడట. ఇంతకీ మహేష్ కథ విజయ్ దగ్గరకు ఎందుకు వెళ్లినట్టు ? అంటే.. దానికి పెద్ద వివరణ ఇస్తున్నారు. అదేంటో ? మనమూ చూద్దాం పదండీ.. !

ఈ యేడాది ‘రంగస్థలం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు సుకుమార్. నాన్ బాహుబలి రికార్డులని సైతం బ్రేక్ చేసిన ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక, ఈ సినిమా తర్వాత సుకుమార్ మహేష్ కి ఓ లైన్ చెప్పి ఒప్పించేశాడు. ఇన్నాళ్లు ఆ కథపైనే కూర్చున్నాడు. ఇటీవలే పూర్తి స్క్రిప్టు పూర్తయ్యింది. దాన్ని మహేష్ కు వినిపించాడు కూడా. ఐతే, ఆ కథ పట్ల మహేష్ పూర్తిగా సంతృప్తి పరచలేదు. దీంతో మహేష్ కోసం మరో కథని రెడీ చేసే పనిలో సుక్కు ఉన్నాడట.

ఐతే, అప్పటికే మహేష్ కోసం రెడీ చేసుకొన్న కథని విజయ్ దేవరకొండకి వినిపించాడట. ఆ కథ ఆయనకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఆ సినిమా ఇప్పట్లో ఉండ ఛాన్స్ లేదు. మహేష్ తో సినిమా తర్వాత సుక్కు ప్రభాస్ తో ఓ సినిమా ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఇటీవలే డార్లింగ్ ని కలిసిన సుక్కు ఓ లైన్ ని వినిపించాడట. పూర్తి స్క్రిప్టుని రెడీ చేయమని ప్రభాస్ సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మహేష్, ప్రభాస్ సినిమాల తర్వాత సుక్కు దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండే ఛాన్స్ ఉంది.