మెగా హీరోలకి మరో హీరోయిన్ దొరికేసింది.. !!


మెగా హీరోల తీరే వేరు. మెగా కాంపౌండ్’లోకి ఓ హీరోయిన్ ప్రవేశిస్తే.. ఆమెని వరుసపెట్టి వాడేస్తుంటారు మెగా హీరోలు. తమన్నా, కాజల్, రకుల్.. విషయంలో అదే జరిగిది. ఈ క్రమంలో వారు స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతుంటారు. ఇప్పుడు అలాంటి అవకాశం యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ కి దక్కింది. నాగ చైతన్య ‘సవ్యసాచి’తో తెలుగు తెరకు పరిచయమైంది నిధి అగర్వాల్.
ఈ సినిమాలో నిధి గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి. నటనలోనూ మంచి మార్కులే పడ్డాయి. మొత్తంగా స్టార్ హీరోయిన్ అనిపించుకొనే అన్ని అర్హతలు నిధిలో ఉన్నాయనే కామెంట్స్ వినిపించాయి. దీంతో నిధిని మెగా హీరోలు బుక్ చేసుకొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ రేజ్ తమ్ముడు సాయి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమా ఫిక్సయ్యింది. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. ఇతడు దర్శకుడు సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రం కోసం హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని తీసుకొన్నారు. అంతేకాదు.. వైష్ణవ తర్వాత నిధి అగర్వాల్ ని వాడుకోవడానికి మెగా హీరోలందరు రెడీగా ఉన్నట్టు సమాచారమ్. అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజు, సాయిధరమ్ తేజ్.. ఇలా అందరూ నిధిపై కన్నేసి ఉంచారట. ఇదే జరిగితే.. త్వరలోనే నిధి స్టార్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయినట్టే.

బాలీవుడ్ చిత్రం ‘మున్నా మైఖెల్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఈ సినిమా తర్వాత నిధి పేరు మారుమ్రోగిపోయింది. టీమిండియా యువ క్రికెటర్ కె ఎల్ రాహుల్ తో ఈ ముద్దుగుమ్మ డేటింగ్ చేసినట్టు వార్తలొచ్చాయ్. వీరిద్దరు కలిసి పార్టీలు, పబ్బులకి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక, ఈ విషయం ప్రక్కన పెడితే తెలుగులో నాగచైతన్య ‘సవ్యసాచి’ తర్వాత ఆయన తమ్ముడు అఖిల్ ‘మిస్టర్ మజ్ఝ్ను’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మెగా కాంపౌండ్ లో తన ప్రస్థానాన్ని మొదలెట్టనుంది. మరీ.. నిధిని మెగా హీరోల వాడకం ఎలా ఉంటుందనేది చూడాలి.. !!