ఇలియానాకు ‘పోకిరి’ నచ్చలేదట !


ఇలియానా… టాలీవుడ్ లో తొలిసారి రూ. కోటి పారితోషికం అందుకొన్న కథానాయిక. దేవదాస్, పోకిరి, కిక్, జులాయ్.. లాంటి బ్లాక్ బస్టర్ అందుకొంది. ఆ తర్వాత బాలీవుడ్ కెళ్లింది. అక్కడ కొన్ని విజయాలు అందుకొంది. ఇప్పుడు ఇల్లీ రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా ఈ శుక్రవారమే (నవంబర్ 16) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న ఇలియానా పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు కావాలని టాలీవుడ్ కి దూరం కాలేదట. జులాయ్ సినిమా చేస్తున్న సమయంలో బాలీవుడ్ లో ‘బర్ఫీ’ సినిమా ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ వరుస సినిమాలతో బిజీ అయిపోయా. దీనికితోడు ఇకపై ఇలియానా టాలీవుడ్ సినిమాలు చేయదనే ప్రచారం తన వద్దకు మంచి కథలు రాకుండా చేసిందని చెప్పుకొచ్చింది.

ఇక, సూపర్ స్టార్ మహేష్ ‘పోకిర్’ కథ ముందుగా ఇలియానాకి నచ్చలేదట. ఆ సమయంలో మహేష్ సోదరి మంజుల ఫోన్ చేసి.. ఒప్పించదట. అది బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పోకిరి అంతటి విజయాన్ని సాధిస్తుందని అనుకోలేదు. కొన్ని సినిమాలు బాగా ఆడుతాయని చేసినా.. ఫలితాన్ని ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. ఫైనల్ గా టాలీవుడ్ లో రీ-ఎంట్రీపై ఆనందం వ్యక్తం చేసింది ఇల్లీ.