70మందితో టీ-కాంగ్రెస్ తొలి జాబితా రెడీ


తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా రెడీ అయ్యింది. 70మందితో కూడిన తొలి జాబితాని మంగళవారం ఉదయం విడుదల చేయబోతున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో దీనిపై తీవ్ర కసరత్తు జరిగింది.
రాహుల్‌ తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ జాబితాని రెడీ చేశారు.

ఈ జాబితాలో ఉస్మానియా జేఏసీలో ఎంతమందికి చోటు కల్పించారు ? బీసీలెందరు ? రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారెవరెవరికి ఇచ్చారు ? మిగిలిన సామాజిక వర్గాలకు ఎలా న్యాయం చేశారు ? వాళ్లకు ఎలాంటి పరిస్థితుల్లో సీట్లు ఇచ్చారు ? తదితర అంశాలకు సంబంధించిన కారణాలను రాహుల్‌ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. మిగతా అభ్యర్థుల జాబితాను కూడా రెండు, మూడు రోజుల్లో ప్రకటించేందుకు అవకాశం ఉన్నట్టు సమాచారమ్.

మరోవైపు, మహాకూటమి ఉమ్మడి ఎజెండా రెడీ అవుతోంది. ఇప్పటికే టీడీపీ, టీజెఎస్ తమ అజెండా, ప్రణాళికను కాంగ్రెస్ ముందు ఉంచారు. అన్ని పార్టీలను కలుపుకుంటూ ఉమ్మడి ఎజెండాను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అభ్యర్థుల ప్రకటన, నామినేషన్స్ దాఖలు, ఎన్నికల మేనిఫెస్టో విడుదలని చేసిన అనంతరం ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది మహాకూటమి.