తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాని విడుదల చేసింది. మంగళవారం ఉదయం ప్రకటించబోతున్నామని చెప్పిన కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాని సోమవారం రాత్రినే ప్రకటించేసింది. ఈ లెక్కన కాంగ్రెస్సూ ముందస్తుకి వెళ్లినట్టు లెక్క ! మొత్తం 65మందితో కూడిన జాబితాని విడుదల చేసింది. పెద్దగా వివాదాలకి ఆస్కారం లేని స్థానాలని తొలి జాబితాలో చేర్చినట్టు అర్థమవుతోంది. ఇందులో కోమట్ రెడ్డి బ్రదర్స్ ఇద్దరికి సీట్లు దక్కాయి. ఇక, వివాదంలో ఉన్న జనగాం స్థానాన్ని ఇందులో పేర్కొనలేదు. టీజెఎస్ అధ్యక్షుడు కోదండరాం బరిలో దిగబోతున్నాడని ప్రచారం జరుగుతున్న రామగుండం స్థానాన్నిఎమ్ ఎస్ రాజ్ ఠాకూర్ కి కేటాయించారు. సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్న గజ్వెల్ స్థానం నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి అవకాశం ఇచ్చారు.